పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మరోసారి వివాదంలో నిలిచారు. లీగల్ అడ్వైజర్ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన పల్నాడు ఎస్పీ కార్యాలయంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కొన్ని గంటల పాటు గదిలోనే ఉండి బయటకు రాకపోవడం కలకలం రేపింది.
ఈ ఘటనతో ఎస్పీ ఆఫీసులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు అధికారులు, పార్టీ నాయకులు మధ్య చర్చలు జరిపి పరిస్థితిని సమీక్షించారు. గతంలో కూడా ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో ఇలాంటి నిరసన చేపట్టిన విషయం గుర్తుకు వస్తోంది.
ఎమ్మెల్యే ప్రవర్తనపై అప్పట్లో పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు సమాచారం. తాజా ఘటనతో ఆయన వ్యవహారం మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.