Macherlaలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో ఓ తండ్రి తన స్వంత కుమార్తెను హత్య చేసిన దారుణం సంచలనం రేపుతోంది.
చౌడేశ్వరి (22) తనకు ఇష్టమైన యువకుడిని పెళ్లి చేసుకోవడం తండ్రి చంద్రశీనుకు అస్సలు నచ్చలేదు. కుటుంబ పరువు పోయిందనే కోపంతో ముందే పథకం వేసుకుని, నిద్రలో ఉన్న సమయంలో దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనను ఆత్మహత్యలా చూపించే ప్రయత్నం చేసినా, పోస్టుమార్టం నివేదికలో అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
పరువు పేరుతో జరుగుతున్న ఇలాంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి.